భారత బౌలర్ల ధాటికి చేతులెత్తేసిన ఆసీన్‌

హైదరాబాద్‌: రెండో టెస్టులో ఆస్ట్రేలియాపై భారత్‌ కమ్రంగా పట్టుబిగిస్తోంది. రెండో ఇన్నింగ్‌లో భారత్‌ ధాటికి ఆసీస్‌ వెరువెంటనే వికెట్లు కోల్పోతూ చేతులెత్తేసింది. రెండు వికెట్లు నష్టానికి 74 పరుగులతో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన ఆసీస్‌ ఆరో వికెట్‌ను కోల్పోయింది. కోవాన్‌ (44) జడేజా బౌలింగ్‌లో సెహ్వాగ్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. అనంతరం వచ్చిన హెన్రిక్‌ జడేజా బౌలింగ్‌లోనే పరుగులేమి చేయకుండా ఔటయ్యాడు. 49 ఓవర్లు ముగిసేసరికి ఆస్ట్రేలియా ఆరు వికెట్లు నష్టానికి 111 పరుగులతో ఆడుతోంది.