మూడునెలల గరిష్టానికి సెన్సెక్స్‌

ముంబయి:బ్యాంకు,ఎఫ్‌ఎంసీజీల షేర్ల లాభాలతో సెన్సెక్స్‌ సూచీ మూడునెలల గరిష్టానికి చేరింది.సెన్సెక్స్‌ 75.86 పాయింట్ల లాభంతో 17538.67వద్ద నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌ 24.75 పాయింట్ల ఆదిక్యంతో 5327.30వద్ద ముగిశాయి.సిప్లాఐసీఐసీఐ బ్యాంకు,టాటా మోటార్స్‌ ఐటీసీ తదితర కంపెనీషేర్లు లాభాలను పొందాయి.ఓఎన్‌జీసీ,బజాజ్‌ఆటో,కోల్‌ ఇండియా స్టెరిలైట్‌ ఇండస్ట్రీన్‌ల షేర్లకు నష్టం వాటిల్లింది.రిటైల్‌ రంగంలో ఎఫ్‌డీఐలను కేంద్రం అనుమతించనుందనే వార్తల నేపథ్యంలో కౌటన్స్‌ రిటైల్‌,ట్రెంట్‌.పాంట్లూన్‌ ఇండియాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లబించింది.