యువజన కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ఈశాన్యరాష్ట్ర వాసులకోసం హెల్ప్‌లైన్‌

హైదరాబాద్‌: రాష్ట్రంలో నివసిస్తున్న ఈశాన్య రాష్ట్రాలవారి సహాయం కోసం యువజన కాంగ్రెస్‌ తరపున హెల్ప్‌లైన్‌ ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర అధ్యక్షుడు వంశీచంద్‌రెడ్డి తెలిపారు. 9000999662 నెంబరుకు ఫోను చేస్తే యువజన కాంగ్రెస్‌ తరపున సహాయం చేస్తామని తెలిపారు.