యూపీఏ ఎంపీలకు సోనియా విందు
ఢిల్లీ: యూపీఏ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఈ రోజు మధ్యాహ్నం ఎంపీలకు విందు ఏర్పాటుచేశారు. రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో యూపీఏ పార్టీల ఎంపీలకు, మద్దతుదారులకు ఆమె ఢిల్లీలోని ఆశోకా హోటల్లో విందు ఏర్పాటు చేశారు. ఈ విందుకు తృణమూల్ ఎంపీలందరూ కానీ ఈ విందుకు హాజరుకావడం లేదని సమాచారం. తృణమూల్ ప్రతినిధిగా రాజ్యసభ సభ్యుడు కేడీ సింగ్ విందులో పాల్గొననున్నారు.