రంగారెడ్డి జిల్లా కోర్టులో బాంబు కలకలం
హైదరాబాద్: ఎల్బీనగర్ రంగారెడ్డి జిల్లా కోర్టులో బాంబు ఉందని వదంతులు రావటంతో ఎల్బీనగర్ పోలీసులు బాంబ్ స్క్వాడ్తో ముమ్మర తనిఖీలు నిర్వహించారు. చివరకు బాంబు లేదని తేలటంతో న్యాయవాదులు, కోర్టుకు వచ్చిన వారు వూపిరి పీల్చుకున్నారు. ఆకతాయిలే ఈ విదమైన పుకార్టు పుట్టించి ఉండోచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.