రాజ్ థాకరేకు నాన్ బెయిలబుల్ వారంట్
ఢిల్లీ: మాహారాష్ట్ర నవనిర్మాణ్ సేన అధినేత రాజ్ ధాకరేకు తాజాగా మరోసారి నాన్ బెయిలబుల్ వారంట్ జారీ అయింది. ఉత్తరాది రాష్ట్రాలవారిపై విద్వేషపూరిత ప్రసంగాలు చేశారని రాజ్ ధాకరేపై డిల్లీలో రెండు ఫిర్యాదులు నమోదయ్యాయి. వాటిపై విచారణకు న్యాయస్థానానికి హాజరుకాకపోవడంతో మారోసారి ఆయనకు నాన్ బెయిలబుల్ వారంట్ జారీచేశారు.



