రైళ్ల రాకపోకలకు అంతరాయం
ఒంగోలు: ఒంగోలు చీరాల మధ్య రైలుమార్గంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడటంతో ఆ మార్గంలో రైళ్ల సర్వీసులకు తీవ్ర అంతరాయం కలిగింది. వెటపాలెం స్టేషన్లో హైదరబాద్ ఎర్నాకుళం శబరి ఎక్స్ప్రెస్, చీరాలలో ఆలెప్పీ ఎక్స్ప్రెస్, అమ్మనబ్రోలులో పినాకిని ఎక్సప్రెస్ రైళ్లను నిలిపివేశారు.