లంచం తీసుకుంటూ పట్టుబడ్డ అధికారి
గుంటూరు: లంచం తీసుకుంటూ ఆదాయ పన్ను శాఖ అధికారి ఒకరు సీబీఐకి పట్టుబడ్డారు. వెంకటేశ్వర్లు అనే వ్యాపారికి పన్ను మాఫీ చేయడానికి అధికారి రూ. 5 లక్షల లంచం డిమాండ్ వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. తొలివిడతగా రూ. 25 వేలు లంచం తీసుకుంటూ ఐటీ అధికారి వెంకటేశ్వరరావు సీబీఐకి పట్టుబడ్డారు.