లాభాల తర్వాత ”స్వీకరణ”

నాలుగు రోజుల తర్వాత ‘స్వీకరణ’ జరిగింది. నిస్తేజ ట్రేడింగ్‌లో సోమవారం బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 31 పాయింట్లు నష్టపోయింది. అంతక్రితం నాలుగు రోజుల్లో సెన్సెక్స్‌ 547 పాయింట్లు పెరిగిన సంగతి తెలిసిందే. సోమవారం 17-363. 04-17, 486.57 మద్య కదలిన సెన్సెక్స్‌ చివరకు 17,363.04 వద్ద ముగిసింది. బలహీన అంతర్జాతీయ ధోరణులతో పాటు భారత ఎగుమతులు 4.16% తగ్గడంబీ బలహీర రుతుపవనాలు ఆహార ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపుతాయన్న నొమురా అంచనాలు సెంటిమెంటును దెబ్బతీశాయి. భారత తయారీ రంగం జూన్‌లో మెరుగ్గా రాణించిందన్న హెచ్‌ఎన్‌బీసీ సర్వేను మార్కెట్లు అంతగా పట్టించుకోలేదు. నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజీ నిఫ్టీ అతి స్వల్పంగా 0.30 పాయింట్లు తగ్గి 5,278.60 వద్ద స్థిరపడింది.

వాహన షేర్లు, కుంగిన ఎఫ్‌ఎమ్‌సీజీ

సెన్సెక్స్‌ 30 ప్క్రివ్‌లలో 16 లాఖాలను పొందాయి. ఎఫ్‌ఎమ్‌సీజీ, వాహన సూయీలు నష్టాలు పొందాగా.. మన్నికైన వినియోగదారు వస్తువులు, పీఎస్‌యూ సూచీలు 1-2.3% మేర మెరుగయ్యాయి. జిందాల్‌ స్టీల్‌, టాటా మోటర్స్‌, టిసిఎన్‌, హీరోమోటోకార్పులు 1.30-2.49% మేర డీలా పడ్డాయి. పొగాకు ఉత్పత్తులపై ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం పన్నులు పెంచిన నేపథ్యంలో ఐటీసీ షేర్లు బీఎన్‌ఈలో 3.42% నష్టపోయి రూ.250.10 వద్ద ముగిశాయి. హెచ్‌ఢీఎఫ్‌సీ బ్యాంకు 1.84% లాభపడింది. భారతీ ఎయిర్‌టెల్‌, స్టెరిలైట్‌, ఖెల్‌ స్టీల్‌, హెఢీఎఫ్‌సీ, గెయిల్‌ ఇండియా, హిందాల్కోలు 1-1.5% మేర రాణించాయి. బీఎస్‌ఈలో 1807 స్క్రీవ్‌లు లాఖాల్లోనూ.. 1033 స్రివ్‌లు నష్టాల్లోనూ ముగిసాయి. శుక్రవారంతో పోలిస్తే మొత్తం టర్నోవర్‌ రూ.3,948.92 కోట్ల నుంచి రూ.1979.08 కోట్లకు తగ్గింది.