: వాతావరణ మార్పుతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : కార్యదర్శి భాగ్యలక్ష్మి
జహీరాబాద్ మార్చి 18 (జనం సాక్షి). గత మూడు రోజుల నుంచి ఆకస్మిక వాతావరణ మార్పుతో పాటు అకాల వర్షంతో ఒక్కసారిగా ఈదురు గాలులు, వడగళ్ల వర్షంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్న విషయం తెలిసిందే, ఇలాంటి ఆకస్మిక వాతావరణ మార్పుతో ప్రజలు అనారోగ్యానికి గురవడంతో పాటు వైరల్ జ్వరాల బారిన పడే అవకాశాలు అధికంగా ఉన్నాయని వైద్యరంగా నిపుణులు హెచ్చరిస్తున్నారు, ఇదే విషయమై శేకపూర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి అకాల వర్షాల వల్ల ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రజలకు ముఖ్యమైన సూచనలు ఇచ్చారు, అత్యవసరం అయితే తప్ప వర్షల్లో బయటికి రావొద్దని, తాగే నీళ్లను వేడి చేసి చల్లార్చి తాగాలని, ఏ మాత్రం అనారోగ్య సూచనలు అనిపించిన డాక్టర్ ని సంప్రదించాలని, భౌతికంగా దూరంగా ఉండి తమ ఆరోగ్యానికి పెద్దపీట వేయాలని, ఇళ్లలో, గల్లీలో చెత్తను ఎక్కడ పడితే అక్కడ వెయ్యడం వల్ల ఈగలు, దోమలు రావడంతో దాని పర్యవసానంగా రోగాలకు గురయ్యే ప్రమాదం ఉన్నందున చెత్తను బుట్టలో వేయాలని, పంచాయతీ సిబ్బంది ఉదయం పూట సేకరిస్తుందని గ్రామ పంచాయతీ కార్యదర్శి భాగ్యలక్ష్మి గ్రామస్తులకు సూచించారు..
వాతావరణ మార్పుతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి కార్యదర్శి భాగ్యలక్ష్మి
Other News
- కొన్నే బీడీ కాలనీ పట్టా భూముల్లో ఇళ్ల ను నిర్మించాలి
- మొక్కజొన్న పంటలను పరిశీలించిన అదనపు కలెక్టర్
- విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్ లు మరియు పెన్నులు పంపిణీ
- విద్యార్థులే ఉపాద్యాయులు అయిన వేళవిద్యార్థులే ఉపాద్యాయులు అయిన వేళ
- మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం
- నాయకులురాయికోటి నర్సిములు ను సన్మానించిన యువ నాయకులు
- పేపర్ లీకేజీ పై కేటి అర్ ను బర్తర్ఫ్ చెయ్యాలి పేపర్ లీకేజీ పై కేటి అర్ ను బర్తర్ఫ్ చెయ్యాలి రాష్ట్ర ఒ బిసి మోర్చ
- మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాల చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే మాణిక్ రావు
- చారిత్రాత్మకమైన జీవో నెంబర్ 11 ప్రభుత్వ ఉద్యోగస్తులతో సమానంగా పేస్కేలుచారిత్రాత్మకమైన
- ఉగాది సందర్భంగా భీమన్న ఆలయం వద్ద అన్నదాన