వ్యక్తి పై కేసు నమోదు

పెద్దపల్లి,జులై25(జనంసాక్షి); కాల్వశ్రీరాంపూర్‌ మండలం జగ్గయ్యపల్లి గ్రామానికి చెందిన పిన్నింటి మోహన్‌ రెడ్డి పై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేశామని పెద్దపల్లి డీఎస్పీ లక్ష్మీనారాయణ తెలిపారు.అదే గ్రామానికి చెందిన అంబాల లక్ష్మీ తనను కులం పేరుతో దూశించాడని ఈ నెల 1న ఇచ్చిన ఫిిర్యాదు మేరకు విచారణ జరిపించి కేసు నమోదు చేశాయని డీఎస్పీ తెలిపారు.