సోమవారం భారత్‌కు రానున్న అక్బరుద్దీన్‌

హైదరాబాద్‌: లండన్‌ వెళ్లిన ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ సోమవారం సాయంత్రం భారత్‌కు రానున్నారు. హిందూ మతాన్ని కించరిచేలా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ ఆయనపై పలు పోలీస్‌స్టేషన్లలో కేసు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో విచారణకు హాజరుకావాల్సిందిగా, డీజీపీ దినేష్‌రెడ్డి అక్బర్‌రుద్దీన్‌కు కోరారు. దీంతో సోమవారం అక్బరుద్దీన్‌ లండన్‌ నుంచి భారత్‌కు వస్తారు.