హిందూపురం నుంచి చంద్రబాబు పాదయాత్ర ప్రారంభం

హిందూపురం: అనంతరపురం జిల్లా హిందూపురం నుంచి తెదేపా అధినేత చంద్రబాబు పాదయాత్ర ప్రారంభించారు. ఆయనకు పార్టీ శ్రేణులు అడుగడుగునా పూలతో స్వాగతం పలికారు. చంద్రబాబు పాదయాత్రకు భారీ సంఖ్యలో ప్రజటు హాజరయ్యారు. ఆంజనేయస్వామి దేవాలయంలో పూజల అనంతరం చంద్రబాబు గాంధీ, పూలె, అంబేద్కర్‌, ఎన్టీఆర్‌ విగ్రహాలను ఆవిష్కరించారు.