అంగన్వాడి సెంటర్ ను పరిశీలించిన సిడిపిఓ లక్ష్మమ్మ

వీపనగండ్ల ఆగస్టు 11(జనంసాక్షి) వీపనగండ్ల మండల కేంద్రంలోని రెండవ అంగన్వాడి సెంటర్ ను గురువారం రోజున ఆకస్మికంగా తనిఖీ చేసిన సిడిపిఓ లక్ష్మమ్మ మరియు అంగన్వాడి సూపర్వైజర్ లక్ష్మి దేవి ఫ్రీ స్కూల్ విద్యా టైం టేబుల్ ను అనుసరించి పిల్లల పట్ల విద్యాసామర్ధ్యాలను పెంపొందించాలని, పిల్లలకు నాణ్యమైన పౌష్టిక ఆహారాన్ని అందించాలని, రోజు గుడ్డు అందించాలని ఆమె అన్నారు. పిల్లల పట్ల శ్రద్ధ వహించి పూర్తి సామర్థ్యాలను మెరుగుపరచాలని కోరారు. వీరితోపాటు అంగన్వాడి టీచర్ మహేశ్వరి ఆయాలక్ష్మి ఉన్నారు.