అంగరంగ వైభోవంగా నేతకానీ బోనాల పండగ

ఖానాపూరం ఆగష్టు 8జనం సాక్షి
మండలంలోని అశోక్ నగర్ గ్రామంలో నేతకానీల కుల దైవం శ్రీ ముత్యాలమ్మ తల్లి బోనాల పండగ వేడుక ఘనంగా సోమవారం నిర్వహించారు.కుల పెద్దలు చెన్నూరి సారంగపని, జనగాం రమేష్, ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ముత్యాలమ్మ తల్లికి ఘనంగా పూజలు చేసి, హోమం నిర్వహించి అనంతరం బోనాల సమర్పించి భక్తులు మొక్కులు  చెల్లించారు. అమ్మ వారిని దర్శించుకున్న వారికీ కొంగుబంగారం అవుతుందాని.అమ్మ వారు చల్లని దీవెనలు అందరికి ఎల్లవేళలా ఉండాలి ఘనంగా పూజలు నిర్వహించం జరిగిందని కుల పెద్దలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కుల గౌరవ పెద్దలు దుర్గం ముత్తయ్య, జనగాం నర్సయ్య, చెన్నూరి పెంటయ్య, జనగాం పెంటయ్య, మాజీ కుల పెద్దలు కిరణ్, శ్రీను,  మరియు కుల సభ్యులు దుర్గం సారంగపని, జాడి వెంకటేష్, జాడి రమేష్, చెన్నూరి చీరంజీవి, చెన్నూరి ముత్తమ్మ, దుర్గం నరేష్, జాడి శ్రీనివాస్, జాడి సారంగపని, దుర్గం సతీష్,జాడి శివ, జాడి సురేష్, జాడి దుర్గ ప్రసాద్, రామటెంకి కార్తీక్, నర్సంపేట నియోజకవర్గం యూత్ అధ్యక్షులు జనగాం ప్రవీణ్ కుమార్ మరియు మహిళలు అయ్యగారు సునారి వెంకన్న తదితరులు పాల్గొన్నారు.