అంటరానితనము పాటిస్తే చర్యలు తప్పవు

మల్దకల్ సెప్టెంబర్ 30 (జనంసాక్షి) గ్రామాలలోని అంటరానితనం కుల వివక్షత పాటించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ రామకృష్ణ హెచ్చరించారు. శుక్రవారం మండల పరిధిలోని కుర్తి రావులచెరువు గ్రామపంచాయతీ కార్యాలయంలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహించారు. గ్రామంలో అందరూ కలిసిమెలిసి జీవించాలని రెండు గ్లాసుల పద్ధతి, అంటరానితనము,దేవాలయ ప్రవేశం అడ్డుకుంటే కేసులు నమోదు చేసి జైలు  తప్పదన్నారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ జయమ్మ ,ఎంపీడీవో కృష్ణయ్య, పంచాయతి కార్యదర్శి లావణ్య, గ్రామస్తులు భాస్కర్ గౌడ్ ,ధనంజయ,కృష్ణ తదితరులు పాల్గొన్నారు.