అంబేద్కర్ కు వినతి పత్రం ఇచ్చిన వీఆర్ఏలు

జనం సాక్షి వెల్దుర్తి

తన న్యాయమైన డిమాండ్ల సాధన కొరకు గత 11 రోజులుగా అలుపెరుగని పోరాటం చేస్తున్న వీఆర్ఏలు ఈరోజు వెల్దుర్తి తహసిల్దార్ కార్యాలయం నుండి ర్యాలీగా వెళ్లి స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పలు డిమాండ్లతో కూడిన వణిదీపత్రాన్ని ఇవ్వడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం గతంలో చెప్పిన విధంగా అర్హులైన వీఆర్ఏలకు పే స్కేల్ ను అమలు చేస్తామని చెప్పి ఇప్పుడు మాట తప్పడం జరిగిందని మాతో వెట్టి చాకిరి చేపిస్తూ చాలీచాలని జీతాలతో మమ్మల్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని వెంటనే ప్రభుత్వం ఏది అయితే చెప్పిందో అదే విధంగా అర్హులైన వారందరికీ పేస్కేల్ ఇవ్వాలని లేని పక్షంలో ఈ ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని వీఆర్ఏల మండల అధ్యక్షులు నరసింహులు తెలిపారు