అకాల వర్షానికి నష్టపోయిన పత్తి రైతులు

అచ్చంపేట ఆర్సి ,సెప్టెంబర్ 30 (జనం సాక్షి న్యూస్) : నియోజకవర్గ పరిధిలోని ఉప్పునుంతల మండలం ఈరట్వాన్ పల్లి గ్రామంలో ఇటీవల ఎడతెరిపి లేకుండా కురుస్తున్న అకాల వర్షాలకు ఎర్ర కుళ్ళు తెగులు వచ్చి పత్తి పంటలు నాశనం అయ్యాయని పలువురు రైతులు ఆవేదన చెందారు. ఇదే క్రమంలో గ్రామానికి చెందిన గుండమోని రాములు మూడు ఎకరాల పత్తి పంట సాగు చేశాడు ,చేతికి వస్తుందనుకున్న పత్తి పంట గత మూడు రోజులుగా కురుస్తున్న వానలకు నాశనం అయిందని పంటపై పెట్టుబడి పెట్టిన డబ్బులు మునిగానని కన్నీటి పర్యంతం అయ్యాడు. నష్టపోయిన మమ్మల్ని పంట నష్టం కింద ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయాలని కోరారు.