అక్బర్‌ రోడ్డు పేరు మార్పునకు యత్నాలు

న్యూఢిల్లీ,మే9(జ‌నం సాక్షి): న్యూఢిల్లీలోని అక్బర్‌ రోడ్డు సైన్‌బోర్డ్‌పై కొందరు ఆగంతకులు బుధవారంనాడు ఒక పోస్టర్‌ అతికించారు. దీనిని మార్చి మహారాణా ప్రతాత్‌ రోడ్డుగా మార్చాలన్న ప్రయత్నం బెడిసికొట్టింది. 
నడుస్తున్న చరిత్రలో గత చరిత్ర ఆనవాళ్లు తుడిచివేసే ప్రయత్నానికి కొందరు ఆగంతకులు చేసిన ప్రయత్నం విఫలమైంది. మహారాణా ప్రతాప్‌ రోడ్‌ అంటూ ఆ పోస్టర్‌పై ముద్రించి ఉంది. దీంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆ పోస్టర్‌ను తొలగించారు. అయితే ఈ చర్యకు పాల్పడిందెవరు, వారి వెనుక ఏ శక్తులు ఉన్నాయనేది ఇంకా తెలియలేదు. అక్బర్‌ మొఘల్‌ సామ్రాజ్య పాలకుడు కాగా, మహారాణా ప్రతాప్‌ రాజ్‌పుత్‌ వీరుడిగా చరిత్ర ప్రసిద్ది చెందారు.