అచ్చంపేటలో ఇంటింటికి జాతీయ జెండా అందజేసిన పురపాలక సిబ్బంది.

అచ్చంపేట ఆర్ సి , ఆగస్టు 10 (జనం సాక్షి న్యూస్ ):- భారత స్వాతంత్ర 75 సంవత్సరాల వజ్రోత్సవాల వేడుకల సందర్భంగా స్థానిక అచ్చంపేట పురపాలకచైర్ పర్సన్ ఎడ్ల నరసింహ గౌడ్, పురపాలక కమిషనర్ బాలరాం నాయక్ ఆధ్వర్యంలో పురపాలక సిబ్బంది మారుతి నగర్ 12వ వార్డులో ప్రతి ఇంటికి వెళ్లి జాతీయ పతాకాన్ని అందజేశారు ఈ సందర్భంగా జాతీయ పతాకం ఎగరవేసే విధానాన్ని జాతీయ పతాకం విశిష్టాన్ని తెలియజేస్తూ ఈ నెల 13వ తేదీ ఉదయం 8 గంటల సమయంలో తమ తమ ఇళ్లపై జెండా ను ఎగురవేయాలని 16వ తేదీ సాయంత్రం 5:45 సమయంలో జెండా గౌరవ వందనం పాటించిన తర్వాత జాతీయ జెండాను ను తీసి జాగ్రత్తగా భద్రపరచాలని సూచించారు.కార్యక్రమంలో పురపాలక రిసోర్స్ పర్సన్స్ ఉమారాణి, సబీనా బేగం, బిల్ కలెక్టర్ బాలక్రిష్ణ, సిస్టం అసిస్టెంట్ నరేష్ వార్డు ఆఫీసర్ మోహన్ పాల్గొన్నారు.