అతిథి అధ్యాపకుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం.

దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ ఆగస్టు 10.

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,ఆగష్టు8(జనంసాక్షి):
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ సైన్స్ కళాశాలలో అతిథి అధ్యాపకుల భర్తీకి దరఖాస్తులను స్వీకరించడానికి ఈనెల 10 బుధవారం సాయంత్రం నాలుగు గంటల లోపు అందజేయగలరని ప్రిన్సిపాల్ ఖమర్ షాజహాన్ సుల్తానా సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.డైరీ సైన్స్ -1 సబ్జెక్టును బోధించేందుకు ఎమ్మెస్సీ డైరీ సైన్స్ పీజీ ఉత్తీర్ణులై పీహెచ్ డి, నెట్,సెట్ ఉండాలన్నారు.ఆ అభ్యర్థులు లేనిచో జంతు శాస్త్రంలో 55 శాతం మార్కులతో పీజీ ఉత్తరులై పీ.హెచ్ డి ,నెట్, సెట్ లో అర్హత పొందిన వారు ఉండాలని తెలిపారు.