అధిష్ఠానాన్ని ధిక్కరించి నామినేషన్‌ వేసిన రాఘవ రెడ్డి

వరంగల్‌: డీసీసీబీ అధ్యక్ష ఎన్నికపై ఉత్కంఠ కొనసాగుతోంది. అధ్యక్ష ఎన్నిక పై నేతలతో సీఎం చర్చిస్తున్న సమయంలోనే అధిష్ఠానాన్ని ధిక్కరించి 11 మంది సభ్యులతో అధక్ష పదవికి జంగారాఘవరెడ్డి నామినేషన్‌ దాఖలు చేశారు. అధిష్ఠానం ఎలాంటి అనుమతి ఇవ్వకముందే రాఘవరెడ్డి నామినేషన్‌ వేయడం పై ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.