అనాజ్ మండిలో మళ్లీ అగ్ని ప్రమాదం

43 మందిని పొట్టన పెట్టుకున్న అగ్నిప్రమాద విషాద ఛాయలు ఇంకా వీడక ముందే దేశ రాజధానిలో మరో అగ్నిప్రమాదం కలకలం రేపుతోంది. ఉత్తర ఢిల్లీలోని రాణి ఝాన్సీరోడ్డులో అనాజ్‌ మండీ ప్రాంతంలో సోమవారం ఉదయం మరోసారి మంటలు ఎగిసిపడుతున్నాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న నాలుగు అగ్నిమాపక  శకటాలు, సిబ్బంది మంటల్ని ఆర్పుతున్నారు.  దీనిపై మరింత  సమాచారం అందాల్సి వుంది.