అనిల్ గోస్వామిని ప్రశ్నించిన సీబీఐ

కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి అనిల్ గోస్వామిని సీబీఐ అధికారులు ప్రశ్నించారు. శారద గ్రూప్ కుంభకోణం కేసులో ఆయన నుంచి వివరాలు రాబట్టారు. ఈ కుంభకోణంలో నిందితులను కాపాడేందుకు తమ అధికారులపై ఆయన ఒత్తిడి చేశారని సీబీఐ ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో కొద్ది రోజుల క్రితం కేంద్ర హోంశాఖ కార్యదర్శి పదవికి గోస్వామి రాజీనామా చేశారు.