అన్నదాతల ఆత్మహత్యలు కనబడడంలేదా!

` వందలాది రైతులు చనిపోతున్నా సీఎం పట్టింపు లేదా!
` కేటీఆర్‌ ఆగ్రహం
హైదరాబాద్‌(జనంసాక్షి):రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఒకే రోజు ముగ్గురు అన్నదాతలు బలికావడానికి ముమ్మాటికీ రైతు వ్యతిరేక రేవంత్‌ సర్కారే కారణమని విమర్శించారు.హైదరాబాద్‌: రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఒకే రోజు ముగ్గురు అన్నదాతలు బలికావడానికి ముమ్మాటికీ రైతు వ్యతిరేక రేవంత్‌ సర్కారే కారణమని విమర్శించారు. పొలం ఉన్న రైతులనూ పొట్టుబెట్టుకుంటున్నరు, కౌలు తీసుకున్న కర్షకులనూ కబళిస్తున్నారని దుయ్యబట్టారు. రైతుకు రక్షణ వలయంగా ఉన్న పథకాలను ఒక్కొక్కటిగా ఎగ్గొట్టడంతోనే వ్యవసాయంలో ఈ విలయం చోటుచేసుకున్నది చెప్పారు.వందలాది రైతులు పిట్టల్లా రాలిపోతున్నా ముఖ్యమంత్రికి చలనం లేదని, ప్రభుత్వానికి బాధ్యత లేదని ఫైరయ్యారు. దసరా పండుగ వేళ వ్యవసాయాన్ని దండుగలా మార్చిన సీఎం రేవంత్‌ కు రైతన్నల చేతిలో దండన తప్పదని హెచ్చరించారు. అన్నదాతలు ఆత్మస్థయిర్యం కోల్పోవద్దని కోరారు. ముంచే రోజులు తొందర్లోనే పోతాయని, మంచి రోజులు మళ్లీ వస్తాయంటూ ట్వీట్‌ చేశారు.‘‘పొలం ఉన్న రైతులనూ పొట్టుబెట్టుకుంటున్నారు. కౌలు తీసుకున్న కర్షకులనూ కబళిస్తున్నారు. ఒకే రోజు ముగ్గురు అన్నదాతలు బలికావడానికి ముమ్మాటికీ రైతు వ్యతిరేక రేవంత్‌ సర్కారే కారణం. ఓవైపు సాగునీటి సంక్షోభం. మరోవైపు రుణమాఫీ ద్రోహం. ఇంకోవైపు రైతుభరోసా మోసం. కౌలు రైతులకూ అందని సాయం. రైతుకు రక్షణ వలయంగా ఉన్న పథకాలను ఒక్కొక్కటిగా ఎగ్గొట్టడంతోనే వ్యవసాయంలో ఈ విలయం. వందలాది రైతులు పిట్టల్లా రాలిపోతున్నా చలనం లేదు. ముఖ్యమంత్రికి సోయి లేదు.. ప్రభుత్వానికి బాధ్యత లేదు. దసరా పండుగ వేళ వ్యవసాయాన్ని దండుగలా మార్చిన.. సీఎం రేవంత్‌ కు రైతన్నల చేతిలో దండన తప్పదు. అన్నదాతలారా ఆత్మస్థయిర్యం కోల్పోకండి. ముంచే రోజులు పోతాయ్‌.. మళ్లీ మంచిరోజులొస్తాయ్‌.’’