అనుమానంతో భార్యను హతమార్చాడు

– అతికిరాతకంగా హతమార్చిన భర్త
– భోపాల్‌లో ఘటన
భోపాల్‌, మే18(జ‌నం సాక్షి ) : వివాహేతర సంబంధం పెట్టుకుందన్న అనుమానంతో ఓ మృగాడు.. తన నాలుగో భార్యను ఘోరంగా చంపేశాడు. మహిళ మర్మాంగ భాగాల్లో బీర్‌ బాటిళ్లను చొప్పించి హత్య చేశాడు. ఈ దారుణ ఘటన భోపాల్‌లోని ప్రగతి నగర్‌లో మూడు రోజుల క్రితం చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. భోపాల్‌కు చెందిన ఓ వ్యక్తి ఇప్పటికే ముగ్గురిని పెళ్లి చేసుకోగా.. వీరిలో ఇద్దరు విడాకులు తీసుకొని వెళ్లిపోయారు. మూడో భార్య అనుమానాస్పదస్థితిలో చాలా రోజుల క్రితం చనిపోయింది. ఈ క్రమంలో నాలుగో పెళ్లి చేసుకున్నాడు. కూలీ పనులు చేసుకుంటూ కాలం వెల్లదీస్తున్నారు. అయితే నాలుగో భార్య మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుందని భర్త అనుమానం వ్యక్తం చేశాడు. ఈ విషయంలో భార్యాభర్తల మధ్య గొడవలు జరిగాయి. ఎలాగైనా భార్యను వదిలించుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో భార్యను దారుణంగా చితకబాదాడు. తలను గొడకేసి బాదాడు. ఆ తర్వాత బీర్‌ బాటిళ్లను ఆమె ప్రయివేటు పార్ట్స్‌లోకి చొప్పించి తీవ్రంగా గాయపరిచాడు. దీంతో బాధితురాలి మృతి చెందింది. ఇక ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో.. ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.