అన్నపూర్ణాదేవిగా వాసవి మాత దర్శనం.

బాలాజీ సిండికేట్ ఆధ్వర్యంలో అన్నదానం.
నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 29(జనంసాక్షి):
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో సాయి బాలాజీ సిండికేట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తు న్న 52వ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా గురువారం వాసవి మాత అన్నపూర్ణాదేవి అలంకరణలో భక్తులకు దర్శనం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆలయంలో నిర్వహించిన విశేష పూజా కార్యక్రమాలతో పాటు సామూహిక పూజా కార్యక్రమాలను ప్రధాన అర్చకులు జోషి పాండురంగ శర్మ నిర్వహించారు.ఈ సందర్భంగా దంపతులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో వందలాది మంది భక్తులు పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.సాయంత్రం నిర్వహించిన పూజా కార్యక్రమాల అనంతరం శ్రీరక్ష కోలాట బృందం మహిళలచే నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ అధ్యక్షులు మాచి పెద్ది శివకుమార్ సభ్యులు హకీం రాజేష్ బొడ్డు రమణ రాధాకృష్ణ అల్లంపల్లి రమేష్ బాదం పరమేష్ ఆకుతోట రాజు నామ రాము లతో పాటు పట్టణ ఆర్యవైశ్యులు పాల్గొన్నారు.