అన్నపూర్ణ దేవిగా అమ్మవారు దర్శనం

గరిడేపల్లిలో మహా అన్నదానం కార్యక్రమం
గరిడేపల్లి, సెప్టెంబర్ 29 (జనం సాక్షి): గరిడేపల్లి మండలంలోని మారుతి నగర్ యందు కొలువున్న పురాతన ఆంజనేయ స్వామి దేవాలయం వద్ద నిర్వహిస్తున్నటువంటి  దేవి శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా గురువారం అన్నపూర్ణ దేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు.
గురువారం ఉదయం కుంకుమార్చన, మహా పూజ, మంత్రపుష్పం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవి శరన్నవరాత్రోత్సవాలలో భాగంగా అమ్మవారి సన్నిధిలో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు మండాది సాత్విక్, మేకపోతుల విక్రమ్, చిక్కుళ్ల పిచ్చయ్య, చిక్కుళ్ల ఉపేందర్, చిక్కుళ్ల వినోద్, మండాది మురళి, మండాది నరేష్, పెండెం సోమశేఖర్, పెండెం సాయి, పెండెం వినయ్, మేకపోతుల వీరస్వామి, మేకపోతుల నరేష్, పెండెం శ్యామ్, మేకపోతుల విజయ్, మేకపోతుల శ్రీనివాస్, మేకపోతుల పురుషోత్తం, మేకపోతుల రాజశేఖర్, మేకపోతుల ప్రవీణ్, కొప్పు మనోజ్, ఎడవెల్లి వినయ్, పగిళ్ల వినోద్, చిక్కుళ్ళ చిన్న వినోద్, చిక్కుల సాయి, గ్రామ పెద్దలు,మహిళలు, భక్తులు, పిల్లలు తదితరులు పాల్గొన్నారు.