అపెండిక్స్ ఆపరేషన్ చేసుకున్న తెరాస కార్యకర్త అలీమోద్దిన్ కు ఆర్థిక సహాయం చేసిన ఎమ్మెల్యే ఆలన్న.,.

జనం సాక్షి, కొత్తకోట, ఆగస్టు 1,   : కొత్తకోట మున్సిపాలిటీ 15వ వార్డు తెరాస ప్రధాన కార్యదర్శి ఎండి అలీమోద్దీన్ తరచు కడుపునొప్పితో బాధపడుతుండగా విషయం తెలుసుకున్న దేవరకద్ర శాసనసభ్యులు ఆల వెంకటేశ్వర్ రెడ్డి జులై 22న ఇంటికి వెళ్లి పరామర్శించారు.తదుపరి చికిత్స కోసం వెంటనే ఆసుపత్రికి వెళ్లాలని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి  మనోధైర్యం ఇచ్చి సూచించగా మహబూబ్ నగర్ లోని శ్రీహర్ష ఆసుపత్రికి కుటుంబ సభ్యులు తీసుకొని వెళ్లారు.వైద్య పరీక్షల అనంతరం అపెండిక్స్ ఆపరేషన్ చేసుకున్న అలీంకు ఎమ్మెల్యే ఆలన్న ఆదేశాల మేరకు పిఏ రాజు గౌడ్ సోమవారం మధ్యాహ్నం శ్రీహర్ష ఆసుపత్రికి వెళ్లి తెరాస కార్యకర్త ఆలీంకు పరామర్శించి ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి  పంపించిన 15వేల రూపాయలను కుటుంబ సభ్యులకు అందజేశారు.ఈ సందర్భంగా 15వ వార్థు కౌన్సిలర్ ఖాజ మైనోద్దిన్, మాజీ వార్డు సభ్యులు ఎండి రజియోద్దిన్ లు ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి బాధిత కుటుంబం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.