అప్ఘానిస్తాన్‌లో ఆత్మాహుతి దాడి 30మంది మృతి

కాబూల్‌: అప్ఘానిస్తాన్‌లో ముష్కరులు మరోసారి రెచ్చిపోయారు. వాయువ్య అప్ఘానిస్తాన్‌లోని ఓ మసీద్‌ వద్ద ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 30మంది మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. ఫర్యాబ్‌ ప్రాంతంలోని ఓ మసీద్‌లో ఈద్‌ ఆల్‌ ఆధా ప్రార్థనలు చేసి బయటికి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాద స్థలికి అధికారులు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.