అభివృద్ధే విజ‌యం వైపు న‌డిపించింది: కేంద్రం మంత్రి నిర్మలా సీతారామన్

బెెంగళూరు: ‘సబ్ కా సాత్ సబ్ కా వికాస్’ అనే బీజేపీ నినాదానికి కర్ణాటక ప్రజలు పట్టం కట్టారని కేంద్రం మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. అభివృద్ధే తారకమంత్రంగా ప్రధాని మోదీ, పార్టీ అధ్యక్షుడు అమిత్‌షా చేసిన ప్రచారం, ఆ దిశగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తున్న కృషిని ప్రజలు బలంగా నమ్మారని తెలిపారు. కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో బీజేపీ పూర్తి మెజారిటీ దిశగా పయనిస్తుండంతో మంత్రి హర్షం వ్యక్తం చేశారు. బీజేపీకి పట్టం కట్టిన కర్ణాటక ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ ఎన్ని మాయమాటలు చెప్పినా, నెగిటివ్ ప్రచారం చేసినా ప్రజలు తిప్పికొట్టారని అన్నారు. అభివృద్ధి ప్రాతిపదికగా ప్రజలు బీజేపీపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకుంటామని, కర్ణాటకను అభివృద్ధి బాట పట్టిస్తామని నిర్మలా సీతారామన్ అన్నారు.