అమరవాయి పంచాయతీ కార్యదర్శి కి ఘనంగా నివాళులు

మల్దకల్ ఆగస్టు 8 (జనంసాక్షి) మల్దకల్ మండలం అమరవాయి గ్రామ పంచాయతీ కార్యదర్శి ఎండి హాసిమ్ గుండెపోటుతో సోమవారం తెల్లవారుజామున ఆకస్మికంగా మృతి చెందాడు. ఆయనకు ఆత్మకు శాంతి చేకూర్చాలని,మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఆవరణ ముందు మండలపరిషత్ ఎంపీడీవో జీ కృష్ణయ్య, సూపరిండెంట్ పెద్ద నరసన్న,ఎంపీఓ ప్రవీణ్ కుమార్ రెడ్డి, ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీపెద్ద వీరన్న,సింగిల్ విండో చైర్మన్ తిమ్మారెడ్డి,ఎంపీటీసీ గోపాల్ రెడ్డి,టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు వెంకటన్న,మార్కెట్ యార్డ్ డైరెక్టర్ సవరన్న ,టిఆర్ఎస్ నాయకులు తూము కృష్ణారెడ్డి,మధు,భాస్కర్ గౌడ్, నరసింహులు, చంద్రశేఖర్ రెడ్డి, గోపాలు, మహేష్,జాన్, మహేష్, పళ్లెం తిమ్మప్ప, నరేందర్, పరశురాముడు, ప్రభాకర్ ,పంచాయతి కార్యదర్శి ఆంజనేయులు తదితరులు పాల్గొని నివాళులర్పించారు.అనంతరం రెండు నిమిషాలు మౌనం పాటించారు.