అమరవీరుల త్యాగాల దినం మొహర్రం

అచ్చంపేట ఆర్సీ,ఆగస్టు 9,(జనం సాక్షి న్యూస్ ) : స్థానిక పట్టణంలో అంబెడ్కర్ చౌరస్తాలో మొహార్రం పర్వదినం సందర్భంగా ముస్లిం మైనారిటీ ప్రజలు అమరులైన మహమ్మద్ ప్రవక్త కుటుంబ సభ్యుల ప్రాణ త్యాగాన్ని స్మరిస్తూ..ప్రార్థన లు చేసి అనంతరం ప్రజలకు పాల షర్బత్ అందజేశారు. కార్యక్రమంలో సాధిక్, ముస్తఫా, అన్వర్, రియాజ్,హరున్, వసిమ్, ఆమీర్, ఆజీమ్ తదితరులు పాల్గొన్నారు.