అమరావతి బ్రాండ్‌ను దెబ్బతీసిన జగన్‌

రాజధానిపై అక్కసు వెళ్లగక్కారు :ధూలిపాళ్ల
గుంటూరు,ఆగస్ట్‌26 (జనం సాక్షి )  : అమరావతి బ్రాండ్‌ ఇమేజ్‌ దెబ్బతీసేలా జగన్‌ కుట్ర చేస్తున్నారని టిడిపి నేత ధూలిపాళ్లనరేంద్ర మండిపడ్డారు. ఆయనకు అభివృద్ది పట్టడదని మండిపడ్డారు. అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి హోదాలో తమనేత చంద్రబాబు నిద్రాహారాలు మాని ప్రపంచమంతా పర్యటించి బ్రాండ్‌ ఇమేజ్‌ను సృష్టిస్తే దాన్ని పాడుచేసేందుకు ప్రయత్నించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. రాజధాని ప్రతిష్టను దెబ్బతీసే చర్యలకు జగన్‌ ఇకనైనా స్వస్తి పలకకుంటే ప్రజాగ్రహాన్ని చవిచూడాల్సి ఉంటుందన్నారు. అమరావతిని ఎందుకు పక్కకు పెట్టారో తెలిఇయంది కాదన్నారు. నవ్యాంధ్ర రాజధానిగా ఎంపికైన పుణ్యభూమి, చారిత్రక నగరం అమరావతిపై విషం చిమ్మే చర్యలపై ప్రజలు త్వరలోనే బుద్ది చెబుతారని అన్నారు. భౌగోళికంగా రాష్టాన్రికి మధ్యన ఉండటం, పవిత్ర కృష్ణాతీర ప్రాంతం కావడంతో అమరావతిని రాజధానిగా సిఎం ఎంపిక చేశారని అన్నారు. చంద్రబాబు నాయుడు కూడా ఈ కారణాలతోనే అమరావతిని రాష్ట్ర రాజధానిగా ఎంపిక చేశారన్నారు. దీన్ని జీర్ణించుకోలేని జగన్‌ ఆది నుంచీ అమరావతిపై అక్కసును వెళ్లగక్కుతూనే ఉన్నారన్నారు. అమరావతి ప్రాంతంలోని అసైన్డ్‌భూములను కొందరు పెద్దలు కొనుగోలు చేసి తమ స్వార్ధంకోసం దళితులను, పేదలను మోసగించారంటూనానాయాగీ చేస్తున్నారని అన్నారు.ఇంతకీ అమరావతి నిర్మిస్తారా లేదా అన్నది తేల్చాలన్నారు.