అమర్‌నాథ్‌ యాత్రకు వర్షం అడ్డంకి

శ్రీనగర్‌,జూన్‌29(జనం సాక్షి): జమ్మూ కాశ్మీర్‌లో నిన్నటి నుంచి ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలతోఅమర్‌నాథ్‌ యాత్ర రెండో రోజు కూడా ముందుకు సాగలేదు. వర్షం కారణంగా శుక్రవారం అమర్‌నాథ్‌ యాత్రను వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. దీంతో భక్తులు బల్తాల్‌, పహెల్‌గావ్‌ క్యాంపులకే పరిమితమయ్యారు. భారీ వర్షాల నేపథ్యంలో టెంట్ల నుంచి భక్తులు బయటికి రావొద్దని భక్తులకు అధికారులు సూచించారు.