అమెరికాలో భారీగా పెరిగిన భారతీయ జనాభా

వాషింగ్టన్‌,సెప్టెంబర్‌23 (జనంసాక్షి ) :  అమెరికాలో నివసిస్తున్న భారతీయుల సంఖ్య ఏటికేటికి భారీగా పెరుగుతోంది. ప్రస్తుతం యూఎస్‌లో దాదాపు 47 లక్షల మంది భారతీయలు ఉన్నారని జనాభా లెక్కలు చెబుతున్నాయి. ఈ మేరకు 2020 నాటి జాతులవారీగా సమగ్ర జనాభా లె క్కల వివరాలను అమెరికా ప్రభుత్వ పరిధిలోని యూఎస్‌ సెన్సస్‌ బ్యూరో విడుదల చేసింది. ఈ లెక్కల ప్రకారం అమెరికాలో నివా సం ఉం టున్న జాబితాలో 52 లక్షల మందితో చైనీయులు తొలిస్థానంలో ఉన్నారు.అమెరికాలో నివసిస్తున్న విదేశీయుల జనాభాలో  చైనా వారు  52 లక్షలు,   భారత్‌  47 లక్షలు ఫిలిప్పీన్స్‌ 44లక్షలు,  వియత్నాం కు చెందిన వారు 22 లక్షల మంది ఉన్నారు.