అమెరికా అధ్య‌క్ష ఎన్నికల్లో భారత సంతతి రామస్వామి పేరు

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థిత్వం కోసం జరిగిన తొలి చర్చ తర్వాత భారత సంతతి మల్టీ మిలియనీర్‌ వివేక్‌ రామస్వామి (38) పేరు మార్మోగుతున్నది. విరాళాల రూపంలో ఆయనకు విశేష ఆదరణ లభిస్తున్నది. తొలి బహిరంగ చర్చ ముగిసిన గంటలోనే రూ. 3.7 కోట్లు విరాళంగా అందుకొన్నారని వివేక్‌ రామస్వామి ప్రచారం బృందం వెల్లడించింది.రిపబ్లిక్‌ పార్టీ తరఫున మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సహా 8 మంది పోటీపడుతున్నారు. ఇందులో భారత సంతతి మహిళ నిక్కీ హేలీ కూడా ఉన్నారు. తొలి చర్చలో ట్రంప్‌ గైర్హాజరీ కావడంతో వివేక్‌ కీలకంగా నిలిచినట్టు కథనాలు ప్రచురితమయ్యాయి.