అమ్మనబోలు మండల సాధన దీక్షకు మద్దతు తెలిపిన బిజెపి

మోత్కూరు ఆగస్టు 7 జనంసాక్షి : గత 15 రోజులుగా అమ్మనబోలు గ్రామంలో చేస్తున్న మండల సాధన దీక్షకు మద్దతుగా ఆదివారం బిజెపి,బీజేవైఎమ్,రాష్ట్ర,జిల్లా,మండల, గ్రామాల నాయకులు, కార్యకర్తలు సంఘీభావం ప్రకటిస్తు దీక్షలో పాల్గొని మండల సాధన కొరకు మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎమ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పజ్జరి వెంకటరెడ్డి,బిజెపి మండల అధ్యక్షుడు కొరివి శంకర్,మండల ఇంచార్జ్ పోతెపక లింగస్వామి,కన్వీనర్ మండలి వెంకన్న, జిల్లా కార్యదర్శి పోతులపటి అరుణ,జిల్లా నాయకులు రాపోలు సంతోష్,మండల నాయకులు బద్దం మల్లారెడ్డి,మునుకుంట్ల గణేష్,నడింపల్లి శ్రావన్, నల్ల వెంకట్ రెడ్డి,బీజేవైఎమ్ మండల అధ్యక్షులు వనం శంకర్, ఉప అధ్యక్షుడు కట్టంగురు శ్రీహరి గౌడ్ , పోతరబోయిన గణేష్,గ్రామ శాఖ అధ్యక్షుడు తులసి మహేష్,శ్రీపతి రకేష్,సంపంగి రమేష్, వల్లజి శివ కుమార్,బద్దం ప్రకాష్ రెడ్డి అనిల్ కుమార్ రెడ్డి ,కట్టంగురు సతీష్,గోలి మధు, కల్లెట్ల రాము, హరీష్,నరేష్ తదితరులు పాల్గొన్నారు.