అమ్మవారిని దర్శించుకున్న ప్రముఖులు

హైదరాబాద్‌: లష్కర్‌ బోనాలు ఘనంగా  జరుగుతున్నాయి. ఈ తెల్లవారుజాము నుంచే పెద్దసంఖ్యలో భక్తులు సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయం వద్ద దర్శినం కోసం బారులు తీరారు. మరోవైపు అమ్మవారిని దర్శించుకునేందకు ప్రముఖులు తరలివస్తున్నారు. ఇప్పటివరకూ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి, తెదేపా అధినేత చంద్రాబాబు, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, ఎంపీ అంజన్‌కుమార్‌ యాదవ్‌, సికింద్రాబాద్‌ ఎమ్మెల్యే జయసుధ తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు.