అమ్మవారి వాల్ పోస్టర్ విడుదల

 జనం సాక్షి,వంగూర్:
మండల కేంద్రంలోని శ్రీశ్రీశ్రీ గెల్వలాంబ మాత ఈనెల 16 నుండి 20 వరకు జరగబోయే బ్రహ్మోత్సవాల సందర్భంగా అమ్మవారి వాల్ పోస్టర్లు కలపత్రాలను ఆదివారం 10 గంటలకు విడుదల చేశారు. ఈ విధముగా మొదటిరోజు నజర్ బోనాలు వైశ్యుల బోనాలు బండ్లు తిరుగును రెండో రోజున పద్మశాలి రెడ్డీస్ గౌడ్స్ బోయ యాదవులు బోనాలు ఇతర గ్రామస్తుల బండ్లు తిరుగును మూడవ రోజున తెలుగువారి బోనాలు నాలుగో రోజున సాయంత్రం 4 గo”లకు రథోత్సవము రాత్రికి శ్రీ కృష్ణ జననము డోలారోహణము ఐదవ రోజు సాయంకాలము యాదవులచే ఉట్లు  కొట్టించబడునని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ అందుగుల వెంకటస్వామి, ఉపాధ్యక్షులు శేఖర్, ప్రధాన కార్యదర్శి సుమన్, కోశాధికారి జనార్ధన్, ఎంపీటీసీ రమేష్ గౌడ్, సర్పంచ్ లావణ్య, యాదగిరిరావు, ఆనంద్, మురళి గెలవయ్య గౌడ్, ఎల్లగౌడ్ ,అరవింద్, శేఖర్, చక్రవర్తి, కర్నాటి శీను తదితరులు పాల్గొన్నారు.