అరేబియా సముద్ర జలాల్లో పాకిస్తాన్ బోటు

న్యూఢిల్లీ: అరేబియా సముద్ర జలాల్లో పాకిస్తాన్ వైపు నుంచి అనుమానాస్పదంగా దూసుకొచ్చిన పాకు బోటు  పేల్చివేత ఘటనలో  వివాదం మరింత ముదురుతోంది. రక్షణమంత్రి  మనోహర్ వారికర్ , కోస్ట్ గార్డ్ డీఐజీ బీకే లోశాలి పరస్పర విరుద్ధ ప్రకటనలతో గందరగోళం నెలకొంది.  దీనిపై  వివక్షాలు  మండిపడ్డాయి.    మరోవైపు  అంతర్జాతీయ నిబంధనలకు విరుద్ధంగా భారత్ వ్యవహరిస్తోందని పాకిస్తాన్   విమర్శలు గుప్పించింది.

ఇది ఇలా ఉంటే  బోట్ పేల్చివేతకు తనకూ సంబంధంలేదన్న కోస్ట్ గార్డ్ డీఐజీ  వ్యాఖ్యలపై  రక్షణ శాఖ మండి పడింది.  అతనికి మాటమార్చడం, ఎదురుదాడి చేయడం అలవాటేనని ఆరోపించింది.