*అవ్వ పించెన్ లు వచ్చాయ్-కేసిఆర్ సార్ ఇచ్చారు!

*ఇంటింటికి తిరిగి చెప్పిన ఎమ్మేల్యే సురేందర్
_________
లింగంపేట్ 14 ఆగస్టు (జనంసాక్షి)
అవ్వా,చెల్లె,తాత,మీకు ఆసరా పించన్ లు వచ్చాయ్ కేసిఆర్ సార్ పంపారు.అని ఎమ్మెల్యే జాజాల సురేందర్ ఐలాపూర్ లో ఇంటింటికి తిరిగి చెప్పారు.ఆయన ఆదివారం లింగంపేట్ మండలంలోని ఐలాపూర్ గ్రామాన్ని సందర్శించి గ్రామానికి 48 కొత్త ఆసరా పింఛన్లు వచ్చాయని ఎమ్మెల్యే సురేందర్ ఇంటింటికి తిరిగి చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం కెసిఆర్ ఆసర పెంచన్ లు మంజూరు చేశారని చెప్పారు.ఇట్టి పెంచన్ లు స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అందజేయనున్నట్లు ఆయన తెలిపారు.ఐలాపూర్ గ్రామంలో కొత్తగా 48 ఆసరా పెన్షన్ రావడంతో ఆసర లబ్ధిదారులు ఎమ్మెల్యేకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ గరీబున్నీస నయీం ఎంపిటీసి దేవేందర్ ఏఎంసి వైస్ చైర్మన్ గజవాడ నరహరి టీఆర్ఎస్ మాజీ మండల అధ్యక్షుడు రాములు టిఆర్ఎస్ కార్యకర్తలు గ్రామస్తులున్నారు.