ఆందోళనకారులపై ఉక్కుపాదం


` 1400 మంది హత్యకు గురైనట్లు గుర్తింపు
` బంగ్లాలో షేక్‌ హసీనా జమానాపై ఐరాస నివేదిక
న్యూఢల్లీి(జనంసాక్షి):బంగ్లాదేశ్‌ అల్లర్లను అణివేసేందుకు ఆనాటి ప్రధాని షేక్‌ హసీనా క్రూరంగా వ్యవహరించిందని, ఆందోళనకారులను హత్యలు చేయించదని, అప్పటి ప్రభుత్వంపై ఐక్యరాజ్యసమితి సంచలన వ్యాఖ్యలు చేసింది. అధికారం చేజారకూడదనే ఉద్దేశంతో నిరసనకారులను హత్య చేసిననట్లు, దాడులు జరిపినట్లు పేర్కొంది. అవి మానవత్వానికి వ్యతిరేకంగా జరిగిన నేరాలని అభివర్ణించింది. ఐరాస స్పందనను అంతర్జాతీయ విూడియా కథనాలు ప్రచురించాయి. 2024లో జులై, ఆగస్టు నెలల్లో జరిగిన ఘటనలకు సంబంధించిన విచారణ ఆధారంగా ఈ వ్యాఖ్యలు చేసినట్లు పేర్కొన్నాయి. ఆ సమయంలో సుమారు 1400 మంది ఆందోళనకారులు చనిపోయినట్లు వెల్లడిరచాయి. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో వందల మంది ప్రాణాలు కోల్పోయారు. దాంతో అప్పటి ప్రధాని షేక్‌ హసీనా తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆందోళనలు తీవ్రంగా ఉండటంతో ఆమె దేశం విడిచి, భారత్‌కు వచ్చి ఆశ్రయం పొందుతున్నారు. ఆమె రాజీనామాతో బంగ్లాలో అవావిూ లీగ్‌ ప్రభుత్వం పడిపోయింది. ప్రస్తుతం మహమ్మద్‌ యూనస్‌ సారథ్యంలో తాత్కాలిక ప్రభుత్వం కొనసాగుతోంది. ప్రస్తుతం హసీనాపై పలు కేసులు నమోదయ్యాయి. బంగ్లాదేశ్‌కు చెందిన అంతర్జాతీయ కైమ్ర్‌ ట్రైబ్యునల్‌ గతంలో అరెస్టు వారెంట్‌ జారీ చేసింది. ఆమెతోపాటు పలువురు మాజీ క్యాబినెట్‌ మంత్రులు, సలహాదారులు, మిలటరీ అధికారులపైనా అరెస్టు వారెంట్‌లు జారీ అయ్యాయి. అలాగే ఆమెను స్వదేశానికి రప్పించేందుకు బంగ్లా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది.