-ఆగస్టు 12,13,14 వ తేదీల్లో అన్ని రకాల పాఠశాలలకు ఎలాంటి సెలవులు లేవు. -డిఈవో గోవిందరాజులు.

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, ఆగష్టు 11(జనంసాక్షి):

స్వతంత్ర భారత 75వ వజ్రోత్సవాల్లో భాగంగా ఆగస్టు 12వ తేదీ రాఖీ పౌర్ణమి ఐచ్చిక సెలవు , ఆగస్టు 13వ తేదీ 2వ శనివారం, ఆగస్టు 14వ తేదీ ఆదివారం రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు వజ్రోత్సవాల రోజు వారి కార్యక్రమంలో భాగంగా నిర్వహించాల్సి ఉన్నందున జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పాఠశాలలకు ఎలాంటి సెలవులు లేవని, ఉపాధ్యాయు లందరూ తప్పనిసరిగా పాఠశాలలకు హాజరుకావాలని డిఈఓ గోవిందరాజులు గురువారం సాయంత్రం ఒక ప్రకటనలో తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని రకాల యాజమాన్య పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు తప్పనిసరిగా పాఠశాలలకు హాజరై ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల మేరకు పాఠశాలల స్థాయిలో నిర్వహించిన రోజువారి కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఆయన ఆదేశించారు.ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను పాటించకుండా ఆగస్టు 12వ,13వ మరియు14వ తేదీలలో పాఠశాలలకు హాజరుకాని ఉపాధ్యాయు లపై జిల్లా కలెక్టర్ క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారని ఆయన హెచ్చరించారు.
ఆయా తేదీల్లో పాఠశాలల స్థాయిలో నిర్వహించాల్సిన కార్యక్రమాలను విజయవంతం చేయాలని డిఇఓ గోవిందరాజులు ఒక ప్రకటనలో కోరారు.