ఆగస్ట్ 15వ తేదీన ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలి

 

మల్దకల్ ఎంపీపీ వై.రాజారెడ్డి

 

మల్దకల్ ఆగస్టు 9 (జనంసాక్షి) తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సారథ్యంలో ఎమ్మెల్వే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆదేశానుసారంబిజ్వారంసర్పంచ్ లక్ష్మన్న ఆధ్వర్యంలో జాతీయ జెండా పంపిణి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మల్దకల్ ఎంపిపి వై.రాజారెడ్డి హాజరై గ్రామప్రజలకు జాతీయ జెండాలను మంగళవారం పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎంపిపి వై.రాజారెడ్డి మాట్లాడుతూ దేశంలోని కులమతాలకతీతంగా పేదధనిక తేడాలేకుండా దేశప్రజలు ఒకే రోజు జరుపుకునే గొప్పపండుగ జాతీయ జెండాపండుగ అని అన్నారు.బ్రిటీష్ ఆంగ్లేయుల పరిపాలన నుండి వారి అక్రమపాలనకు చరమగీతం పాడుతో స్వదేశం సిద్ధించిన రోజు ఆగస్ట్ 15వ తేదీన జాతీయ జెండా పండుగ జరుపుకోవడం భారతదేశ ప్రజలకు గర్వించదగ్గరోజు అని అన్నారు. ప్రభుత్వ కార్యాలయంలకే పరిమితమైన జాతీయ జెండా ఆవిష్కరణ నేడు ప్రతి ఇంటిపై భారతదేశ జాతీయ జెండా ఆవిష్కరణ చేయడం కులమతాలకతీతంగా ఒకేరోజు అమరుల త్యాగాన్ని తలచుకుంటూ భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటుకోవడం దేశ ప్రజలు చేసుకున్న అదృష్టం అని అన్నారు.నేటి యువత చెడుమార్గాల్లోకి వెళ్లకుండా దేశ అభ్యున్నతి కోసం కృషిచేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో,మండల టిఆర్ఎస్ అధ్యక్షుడు వెంకటన్న,గ్రామ పంచాయితీ సెక్రటరీ రాజేష్,టిఆర్ఎస్ నాయకులు నాగేశ్వర్ రెడ్డి,సవారన్న,గోపాల్,యువజన నాయకులు గోవింద్,మల్లయ్య,పంచాయతీ సిబ్బంది కందికట్టే గోకరన్న,సత్యన్న, భీమన్న,ఈతచెట్టు సవరన్న తదితరులు పాల్గొన్నారు.