ఆత్మప్రబోదంతో ఓటేయండి

లక్నో:రాష్ట్రపతి ఎన్నికల్లో ఎంపీలు,ఎమ్మేల్యేలంతా ఆత్మప్రబోదానుసారం ఓటేయాలని భాజపా మద్దతిసున్న అభ్యర్థి పీఏసంగ్మా కోరారు.లక్నోలో విలేకరులతో మాట్లాడుతూ పార్టీల నిర్ణయాలకు అతీతంగా ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు.పార్టీలు వివ్‌లు జారీ చేయడం చెల్లదని వివరించారు.1969 లో వీవీగిరి ఆత్మప్రబోధ ఓటుతోనే గలిచారని,మరోసారి దానిని చేయాలని కోరారు రాష్ట్రపతి ఎన్నికల్లో నిలిచే అభ్యర్థి ఏపార్టీకి చెందరన్నారు.ప్రణబ్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి కారనీ పార్టీకి రాజీనామా చేసి స్వతంత్ర అభ్యర్ధిగానే పోటీ చేస్తున్నారు.ప్రణబ్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి కారనీ పార్టీకి రాజీనామా చేసి స్వతంత్ర అభ్యర్ధిగానే పోటి చేస్తున్నారనీ తానూ స్వతంత్ర అభ్యర్థినేనని పేర్కొన్నారు.