ఆదరిస్తే మరింత అభివృద్ధి

ఆదరిస్తే మరింత అభివృద్ధి

వనపర్తి,బ్యూరో అక్టోబర్ 19 (జనంసాక్షి)స్వరాష్ట్రంలో బిఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత గత తొమ్మిది సంవత్సరాలలో జరిగిన అభివృద్ధి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు బిఆర్ఎస్ పార్టీని మూడవ సారి అధికారంలోకి తీసుకొస్తుంది సింగిరెడ్డి వాసంతి అన్నారు. గురువారం శ్రీ రంగాపురం మండలంలోని జానంపేట గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నిరంజన్ రెడ్డి తరుపున కార్యకర్తలతో కలిసి ఇంటి ఇంటికి తిరిగి ప్రచారం చేస్తూ వారి సమస్యలను తెలుసుకున్నారు. గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్తూ అందరిని ఆప్యాయంగా పలకరిస్తూ వృద్ధులతో సరదాగా మాట్లాడి పింఛన్ వస్తుందా అని వివరాలను అడిగి తెలుసుకున్నారు. పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మేనిఫెస్టోలోని పథకాలను ప్రజలకు వివరిస్తూ ఓట్లను అడిగారు. ఇన్నేళ్ల నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయకుండా ఇప్పుడు అధికార దాహంతో ప్రజల ముందుకు వస్తున్న ప్రతిపక్షాలకు ఓటుతోనే సమాధానం చెప్పాలని సింగిరెడ్డి వాసంతి అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గాయత్రి, సర్పంచులు వెంకటేశ్వర్ రెడ్డి, వినీలరాణి, పార్టీ సీనియర్ నాయకులు పృథ్వీరాజ్, పార్వతలు, కురుమూర్తి, బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.