ఆదర్శంగా హిందూపురం బస్టాండ్‌

అనంతపురం,ఫిబ్రవరి28: హిందూపురం ఆర్టీసీ బస్టాండ్‌ ప్రాంగణాన్ని అందంగా తీర్చిదిద్ది ఆంధప్రదేశ్‌కే ఆదర్శంగా మారుస్తామని అనంతపురం జిల్లా స్వచ్ఛభారత్‌ ప్రచారకర్త, సినీనటుడు నరేశ్‌, అనంతపురం ఆర్టీసీ ఆర్‌ఎం వెంకటేశ్వరరావులు అన్నారు. శనివారం ఉదయం స్థానిక ఆర్టీసీ బస్టాండులో స్వచ్ఛభారత్‌లో భాగంగా స్తూపం ఏర్పాటుకు భూమిపూజ, మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. మూడు నెలల్లో దాతల సహకారంతో అందమైన, పరిశుభ్రమైన ప్రాంగణంగా ఆర్టీసీ బస్టాండ్‌ను తీర్చిదిద్దుతామని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్వచ్ఛభారత్‌ ప్రచారకర్త ఆదరణ రామకృష్ణ, గోపినాథ్‌, బాబా ఫకిరుద్దీన్‌ పాల్గొన్నారు.