ఆదర్శ పాఠశాలలో పౌష్టికాహారం అవగాహన…

శంకరపట్నం జనం సాక్షి సెప్టెంబర్ 22
పోషణ మాసం పురస్కరించుకొని గురువారం మోడల్ స్కూల్ విద్యార్థినీలకు పౌష్టికాహారం పై అవగాహన సదస్సు నిర్వహించి ర్యాలీని చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పౌష్టికాహారం పై మహిళ శిశు సంక్షేమ శాఖ ఐసీడీఎస్ అంగన్వాడి ఆధ్వర్యంలో అవగాహన కల్పించి, విద్యార్థులచే ర్యాలీ నిర్వహించి, పౌష్టిక ప్రతిజ్ఞ చేయించారు.. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు కమలాబాయి, సోనీ, పద్మ కుమారి ,సుమలత, ఏఎన్ఎం జయశ్రీ, ఉపాధ్యాయినీలు, విద్యార్థులు, ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు