ఆదిత్య ఎల్‌`1లో కీలక సవరణ

` ఈ నెల 6న నిర్వహణ
` ఇస్రో ప్రకటన
న్యూఢల్లీి(జనంసాక్షి):ఆదిత్య ఎల్‌`1 మిషన్‌ భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఎూఖీూ) ఆదివారం కీలక అప్‌డేట్‌ను అందించింది. అంతరిక్ష నౌక సక్రమంగానే పని చేస్తుందని, సూర్యుడి వైపు దూసుకుపోతుందని పేర్కొంది. అయితే, సరైన మార్గంలో ఆదిత్య`ఎల్‌1ని ఉంచేందుకు కీలకమైన ఆపరేషన్‌ నిర్వహించినట్లు పేర్కొంది. స్పెస్‌ క్రాఫ్ట్‌లోని ఇంజిన్లను 16 సెకన్ల పాటు మండిరచి ట్రాజెక్టరీ కరెక్షన్‌ మ్యాన్‌యూవర్‌ను నిర్వహించినట్లు పేర్కొంది. ఈ నెల 6న దిద్దుబాటు కార్యక్రమం జరిగిందని, ఈ ప్రక్రియలో స్వల్ప మార్పులు చేసినట్లు పేర్కొంది.ఇలాంటి కరెక్షన్‌ను ఇస్రో చేపట్టడం ఇదే తొలిసారి సెప్టెంబర్‌ 19న చివరిసారిగా ట్రాన్స్‌`లాగ్రాంజియన్‌ పాయింట్‌ 1 ఇన్సర్షన్‌ మాన్యువర్‌ను పూర్తి చేసిన తర్వాత దాని ట్రాక్‌ను సరిచేయడానికి ఇది అవసరమని ఇస్రో పేర్కొంది. ట్రాన్స్‌`లాగ్రాంజియన్‌ పాయింట్‌ చుట్టూ హాలో ఆర్బిట్‌ చొప్పించాల్సి వచ్చినట్లు ఇస్రో చెప్పింది. ట్రాజెక్టరీ కరెక్షన్‌ చేయడంతో ఆదిత్య`ఎల్‌1 అంతరిక్ష వాహక నౌక.. ఉద్దేశించిన మార్గంలో సాగుతోందనే విషయం నిర్ధారణకు వస్తుందని పేర్కొన్నారు. ఇంకొన్ని రోజుల్లో మాగ్నెటో విూటర్‌ మళ్లీ ఆన్‌ చేయనున్నట్లు వివరించింది. ఇదిలా ఉండగా.. ఆదిత్య`ఎల్‌1 మిషన్‌ను సెప్టెంబర్‌ 2న ఇస్రో చేపట్టిన విషయం తెలిసిందే.పీఎస్‌ఎల్‌ సీ`57 లాంచ్‌ వెహికిల్‌ నుంచి ఆదిత్య ఎల్‌`1ని ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది. ఏపీలోని శ్రీహరికోటలోని సతీశ్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ నుంచి ప్రయోగం నిర్వహించింది. ఆ తర్వాత కక్ష్యను మార్చుకుంటూ సూర్యుడి వైపు బయలుదేరింది. దాదాపు 120 రోజుల పాటు ప్రయాణించి లాగ్రేంజియన్‌ పాయింట్‌కు చేరుకోనున్నది. ఇది భూమికి 1.5 మిలియన్‌ కిలోవిూటర్ల దూరంలో ఉంటుంది. అక్కడ నుంచి సూర్యుడిపై అధ్యయనం చేయనున్నది. సౌర గాలులు, సౌర తుఫాన్లతో పాటు నక్షత్రాల అధ్యయనంలోనూ సహాయం అందించనున్నది. నక్షత్రాలు, గెలాక్సీ, ఖగోళ శాస్త్రానికి సంబంధించి అనేక రహస్యాలను అర్థం చేసుకోవడం సహాయపడనున్నది.